Mancherial : బోరు బావి నుంచి గులాబీ రంగు నీళ్లు..భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు.. దేవుని మాయ.. విష ప్రభావమా అంటూ ఆందోళన

మంచిర్యాల జిల్లా చెన్నూరులో కలకలం రేగింది. చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి అనే ఓ ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు రావడం ఆందోళనకు కారణమైంది. నిన్న రాత్రి వరకు స్వచ్చమైన నీటిని అందించిన కట్ట శ్రీనివాస చారి బోరు.. ఒక్కసారిగా ఉదయం గులాబి నీటి దారతో దర్శనం ఇవ్వడంతో చారి కుటుంబ సభ్యులు విస్తు పోక తప్పలేదు. ఏకబిగువునా బోరు నుండి గులాబీ రంగులో నీరు ప్రవాహం కొనసాగుతూనే ఉండటంతో భయబ్రాంతులకు‌ గురైన ఇంటి యజమాని శ్రీనివాస్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో గులాభీ రంగు నీటి విషయం చెన్నూరు అంతా దాహనంలా వ్యాపించింది.