కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహాన్ ఆర్యమాన్ సైతం క్రీడా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. మంగళవారం(సెప్టెంబర్ 02) జరగనున్న మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) ఎన్నికల్లో మహాన్ ఆర్యమాన్ పోటీ లేకుండా అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. 29 సంవత్సరాల వయసులో, ఆయన MPCA కి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండోర్ చేరుకున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మహాన్ ఆర్యమాన్కు ఘన స్వాగతం లభించింది.