భూమి నుంచి ఉబికి వస్తున్న పాతాళ గంగ

మొన్నటి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం మొదలై రెండు నెలలు అవుతున్నా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసాయి. గత కొన్ని రోజులుగా క్రితం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. అన్ని చోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చాలావరకు చెరువులు మత్తడి పోస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎండిపోయిన బోర్లు కూడా ఇప్పుడు పైపుల నిండుగా నీరు పోస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా బోరు బావుల్లో నుంచి జలాలు ఉబికి వస్తున్నాయి.. ఇలాంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో కనిపించింది.