ఓటేసిన రాష్ట్రపతి

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.