వేయి స్తంభాల గుడి ఆవరణలో కళ్యాణ మంటపం పునః నిర్మాణ..

కాకతీయుల తదనంతరం వేయి స్తంభాల గుడి ఆవరణలోని కల్యాణమండపం క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఢిల్లీ సుల్తాన్ ల దండయాత్రలో రూపం కోల్పోయిన కల్యాణ మండపం మట్టిలో కలిసిపోయే దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే 2005లో ఈ కల్యాణ మండపం పునః నిర్మాణానికి బీజం పడింది. 2006లో ఫిబ్రవరి నెలలో కేంద్ర పురావస్తుశాఖ కల్యాణ మండపం పునః నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.