ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా విజయవాడలో ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు వైఎస్ షర్మిల. AICC అగ్రనేతల సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు. కాంగ్రెస్ను రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. పార్టీ చేరికల్లోను, వ్యవహారాల్లోను షర్మిలకు వెన్నుదన్నుగా .. ఆఇద్దరు కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేతలు నిలుస్తారనే టాక్ వినిపిస్తుంది.