నిర్మల్ జిల్లాలో ఎండిపోతాయనుకున్న పంటలకు ప్రాణమొచ్చింది. మూసుకున్న కెనాల్ గేట్లు షరతులతో కూడిన ఒప్పందంతో తెరుచుకోవడంతో పంటలకు పునర్జీవం పోసినట్టైంది. కరువు కోరలతో తెలంగాణ వర ప్రదాయినైన శ్రీరాంసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువవడంతో.. సాగుకు ఇవ్వలేమంటూ వారం రోజుల క్రితం అధికారులు చేతులెత్తేశారు. దీంతో కోతదశకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు.