కొంప ముంచిన సెల్ఫీ మోజు.. రెప్పపాటులో..

కొంప ముంచిన సెల్ఫీ మోజు.. రెప్పపాటులో.. ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది. వెంటనే స్పందించిన స్థానికులు, ఆ మహిళను శ్రమించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఓ ఫ్యామిలీ సరదగా చుద్దామని.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లారు. అయితే అక్కడ తన భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఇంతలో ప్రమాదవశాత్తు మహిళ కాలు జారి కాలువలో పడింది. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఆ మహిళను కాపాడారు. ఆమెను కాపాడేందుకు దాదాపుగా 40 నిమిషాల పాటు కష్టపడ్డారు. మహిళను ప్రాణాలతో బయట పడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు.