మర్రి ఉడలతో కొలువుదీరిన గణనాథుడు

వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట పట్టణంలో పలు వినాయక మండపాలను ఆహ్లాదంగా, వినోదంగా , ప్రకృతితో మమేకమై తీర్చిదిద్దారు..సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్ లో వీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మర్రి ఉడలతో డెకరేషన్ చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ గణనాథున్ని చూస్తే సహజ సిద్ధమైన అడవిలో మర్రి ఉడల మధ్యలో వినాయకుణ్ణి నెలకొల్పినట్లు ఉన్నాడు. మర్రి ఉడాలకు కలర్ పుల్ లైటింగ్ ఏర్పరచి కన్నులు మిరిమిట్లు గొలిపే విధంగా గణనాథుని ఏర్పాటు చేశారు. ప్రకృతి ఒడిలో లంబోదరున్ని ఏర్పాటు చేయడంతో ఈ వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.