తాగి వచ్చిన హెడ్ మాస్టర్‌కు భలే ట్రీట్‌మెంట్‌..!

విద్యాబుద్ధులు నేర్పి.. భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు.. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందు కొట్టి పాఠశాలకు హాజరయ్యాడు. ఒళ్ళు మరిచి పిల్లలపై ప్రతాపం చూపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడికి తగిన బుద్ధి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలం జీపీ పల్లి గ్రామంలో బుధవారం జరిగింది ఈ ఘటన.