రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది RSS మూలసిద్ధాంతం అని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అయన. ఈ సందర్భంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అమలుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కుట్రలో భాగంగానే తనపై ఢిల్లీలో అక్రమ కేసు పెట్టారన్నరు. రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఎజెండా అని సీఎం రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలని BJPప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే వాజ్పేయ్ హయాంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశారన్నారు.