ఇదేం ఇగోరా సామీ.. ఏకంగా గుండు చేయించాడు..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లింగాల పోలీస్‌స్టేషన్‌లో యువకులకు శిరోముండనం చేయించడం కలకలం సృష్టిస్తోంది. ఓ కేసు విషయంలో ముగ్గురు యువకులకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై శిరోముండనం చేయించాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.