సిక్కింలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి.. ప‌వ‌ర్ స్టేష‌న్ ధ్వంసం

సిక్కింలో ప్రకృతి ప్రకోపానికి భారీ ప్రమాదం సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌లోని పవర్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. 510 మెగావాట్ల పవర్ స్టేషన్‌ను అనుకుని ఉన్న కొండ గత కొన్ని వారాలుగా కొంచెం కొంచెం కూలుతూ.. ఇవాళ పూర్తిగా విరిగిపడింది.