'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. పంజాగుట్ట ర్యాష్‌ డ్రైవింగ్ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే షకీల్..

పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో అరెస్ట్ అయిన రహీల్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఒక వీడియో విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తులో తన కుమారుడికి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. తన కుమారుడికి సంబంధం లేని కేసులో ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన కుమారుడిది తప్పు ఉంటే చట్టబద్దంగా ఉరితీసినా ఒప్పుకుంటానన్నారు. తప్పుడు విచారణ చేస్తున్న పోలీసులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.