పాముకు అంతిమ యాత్ర

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. చనిపోయిన ఓ పాముకి స్థానికులు ఘనంగా దహన సంస్కారాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనియాంసంగా మారింది. ఈ వార్త విన్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు అది భగవంతుని మహిమగా చెప్పుకుంటున్నారు. పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలో మేళం వారి మెరక ప్రాంతంలో చనిపోయిన ఓ త్రాచుపాముని స్థానికులు గుర్తించారు.