అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ సడెన్గా కాలేజ్ బిల్డింగ్పై నుంచి దూకేశాడు. క్లాస్ రూం నుంచి బయటకు వచ్చి.. అంతా చూస్తుండగానే మూడో అంతస్తు రెయిలింగ్ నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజ్ ఎదుట ఆందోళనను నిర్వహించాయి.