చలికాలం సమీపిస్తుండటంతో వెచ్చదనం కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ప్రమాదం ఏ క్షణమైనా పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విజయనగరం రాజాం డోలపేటలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఓ పాము కాటు వేసింది. ట్యూషన్కి వెళ్లిన బాలుడి సైకిల్ లో చొరబడ్డ రక్త పింజరి పాము.. అందులో నక్కింది. ట్యూషన్ అనంతరం బయటకు వచ్చిన బాలుడు సైకిల్ ఎక్కగానే పాము కాలుకు చుట్టుకుంది.