ఇటీవల కాలంలో చెట్లను నరికేయడంతో అడవిలో ఉండాల్సిన వణ్యప్రాణులు సర్పాలన్ని జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన వాటిని చూసి జనాలు భయాందోళనకు గురై వాటికి కొట్టి చంపడమో లేదా.. అటవీశాఖ అధికారుల సహాయంతో తిరిగి అడవితో వదిలేయడమో జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం వద్ద ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. మొదట దాన్ని చూసిన జనాలు కర్రేమో అనుకున్నారు. కానీ అది కదులుతుండడంతో దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. దాంతో భయాందోళనకు గురై దాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.