మరోసారి సింప్లిసిటీని చాటుకున్న కేంద్ర మంత్రి!

ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.. చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ.. జనంలోకి రావాలంటే ఆలోచిస్తారు. అలాంటిది.. శుక్రవారం(అక్టోబర్) సాయంత్రం అనుకోకుండా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని నీలోఫర్ కేప్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యక్షం అయ్యారు. ఒక్కసారిగా కేంద్ర మంత్రి కేఫ్‌లో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అక్కడున్న వారందరితో సరదాగా మాట్లాడుతూ సరదా గడిపారు. అనంతరం మస్కా బన్, చాయ్ తాగారు.