షిప్‌ను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు..

హైజాక్ కు గురైన సమయంలో ఈ నౌక బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వైపు ప్రయాణిస్తోంది. సోమాలియా తీర ప్రాంతం నుంచి 300 నాటికల్ మైళ్ల దూరంలో వెళ్తున్న సమయంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. హైజాక్ కు గురైన వెంటనే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్‌‌కు ఎం వీ లీలా సిబ్బంది ప్రత్యేక మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపారు. లైబీరియా జెండాతో వెళ్తున్న మర్చెంట్ షిప్ హైజాక్ అయిందన్న సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ నేవీ మెరుపు వేగంతో స్పందించింది.