మూడో రోజు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర - TV9

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడోవ రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడులోని నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి బస్సు యాత్ర శుక్రవారం ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా సీఎం జగన్ రాళ్లదొడ్డి చేరుకోనున్నారు.