ఓర్నాయనో.. ఫ్రీ బస్సును ఇలా కూడా వాడుతున్నారా? పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. రేవంత్‌ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో కానీ.. నిత్యం ఏదో ఒక లొల్లితో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగలు, పబ్బాల సమయంలో సరేసరి. బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి.