డాక్టర్స్ ఆపరేషన్ చేస్తుంటే రీల్స్ చూస్తున్న పేషెంట్.. కారణం తెలిస్తే శభాష్‌ అంటారు..!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. లక్నోలోని కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఇనిస్టిట్యూట్‌లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. అది కూడా రోగి పూర్తి మేలకువగా ఉండగానే అతనికి ఆపరేషన్‌ నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం అతను ఆస్ప్రతిలో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని వైద్యులు వెల్లడించారు. అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్‌ కానున్నట్టుగా చెప్పారు.