మురికి నీటిలోకి దిగి మహిళ ఒంటరి పోరు..

నగరవాసుల ఆవేదనను కళ్లకు కడుతూ ఓ మహిళ ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ ఇలా ఆందోళనకు దిగారు. వానొచ్చింది. నాసిరకం రోడ్డును తుడిచి పెట్టేసింది. కంకర తేలడమే కాదు ఏకంగా గుంతలు పడి నీళ్లు నిలిచిపోయాయి. పిల్లలో పెద్దలో అటుగా వెళ్తే.. అక్కడేదైనా మ్యాన్‌ హోల్‌ ఉంటే పరిస్థితి ఏంటి? జరగకూడినిదీ జరిగితే అందుకు బాధ్యులెవరు?. వర్షం తెరిపిచ్చినా బల్దియా కళ్లు మాత్రం తెరుచుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బురదలో కూర్చుని మరి నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు నచ్చచెప్పినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రోడ్‌ సేఫ్టీపై జీహెచ్‌ఎంసీ అధికారులు నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తగ్గేదేలేదన్నారు.