‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఎట్‌ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమంలో సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు హాజరయ్యారు. తేనీటి విందు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.