పోలీస్‌ స్టేషన్‌పైకి ఎక్కిన ఎద్దు..! భయంతో హడలెత్తిపోయిన ఖాకీలు

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు అనుకోని అతిథిగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. దీనిలో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా? అది పోలీస్‌ స్టేషన్‌లోపలికి కాకుండా ఏకంగా స్టేషన్‌ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది. గంటల తరబడి అక్కడే ఉండి.. ఆనక తీరిగ్గా కిందికి వచ్చింది. దీంతో ఎద్దు తమ మీద ఎక్కడ పడుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని సలోన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.