బంగారం ధరలు అమాంతం పెరగటంతో ఇప్పుడు అందరి కళ్ళు బంగారం పైనే పడింది. కొందరు దుండగులు ఈజీ మనీకి అలవాటు పడి, చైన్ స్నాచింగ్స్ కి సైతం పాల్పడుతున్నారు. ఏమాత్రం జాలి, దయ, కనికారం, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బంగారం కోసం అవసరమైతే ప్రాణాలు తీయటానికి అయిన, దాడులు చేయటానికి వెనుకాడటం లేదు. దీంతో బంగారు ఆభరణాలు ధరించిన మహిళ ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.