పాడె కట్టి, పసుపు పూసి.. పాముకు అంతిమ యాత్ర.. ఎందుకిలా చేశారంటే..

ఏలూరు, మే 15: చనిపోయిన పాముకు హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు గ్రామస్థులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అరుదైన వింత సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. మన పూర్వీకుల నుంచి నేటి వరకు ఏ హిందూ కుటుంబంలోనైనా పురుషులు గాని, స్త్రీలు గాని చనిపోతే వారికి దహన సంస్కారాలు ఘనంగా నిర్వహిస్తారు.