ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. జనవరి 29 బుధవారం మౌని అమావాస్య ప్రభావంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకు త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది.