అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆశ్చర్యపోయే ఘటన..! దసరా సెలవులకు ముందు బడికి తాళాలు వేసి వెళ్లారు ఉపాధ్యాయులు.. సెలవులు గడిచాయి.. మళ్లీ స్కూళ్ళు తెరిచేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయానికి అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ స్కూలు భవనం కనిపించలేదు. అంతా శిధిలాలే ఉన్నాయి.