ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా.. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత..

ఈసీ, పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. పోలింగ్ కేంద్రాల్లోని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల సందర్బంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.