నేడు మహాలక్ష్మిగా కన్యకా పరమేశ్వరి.. 3.33 కోట్ల కరెన్సీతో అలంకరణ

కోనసీమ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమలాపురం లో శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి దేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ అదరహో అనిపిస్తుంది. మూడు కోట్ల 33 లక్షల తో అమ్మవారిని అలంకరించారు ఆలయ నిర్వాహకులు. అమ్మవారి ముఖ మండపంతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం కరెన్సీ నోట్లతో నోట్లతో అలంకరణ ధగధగ లాడుతుంది.