శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు

శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది. నిన్న రాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు. భక్తులు కారులో కూర్చొని చిరుతపులి గేటు ముందున్న దృశ్యాలను వారి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. జనసంచారం చేసే ప్రాంతంలోకి చిరుత పులి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.