ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం తళుక్కుమని మెరిసింది. న్యూజిల్యాండ్లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కు మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సీరాజ్ భారత్కు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. మూడేళ్ల పాటు తాను ఎంతో శ్రమించి కఠోరంగా శిక్షణ పొందిన ఇన్లైన్ స్కేటింగ్లో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్ధులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది.