సిక్కోలు తీరానికి కొట్టుకొచ్చిన భారీ అరుదైన చేప

ఇచ్చాపురం మండలం, డోంకురు తీరప్రాంతంకి అరుదైన భారీ చేప కొట్టుకువచ్చింది. అది అప్పటికే మృతి చెందింది. దాని పొడవు సుమారు 16అడుగులు కాగా.. వెడల్పు సుమారు 6 ఆడుగులు ఉంది. అరుదైన చేప బరువు రెండు టన్నులు ఉంటుందని స్థానిక మత్స్యకారుల అంచనా వేశారు. ఇంత భారీ చేప ఎందుకు కొట్టుకువచ్చింది అనేదానిపై ఇంకా సరైన సమాచారం లేదు.