భారత రాష్ట్ర సమితిలో మరో వికెట్ పడిపోయింది. గద్వాల రాజకీయాలు హైదరాబాద్కి చేరాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే.