హడలెత్తిస్తున్న నిపా వైరస్, కేంద్రం అప్రమత్తం, కేరళకు వైద్య బృందం

కేరళలో ఓ 14 ఏళ్ల బాలుడి ప్రాణాలు బలితీసుకున్న 'నిపా' వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మరణం నిపా వైరస్ కారణంగానే సంభవించిందని ధృవీకరించుకున్న వెంటనే కేరళకు వైద్య బృందాన్ని పంపించింది.