పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమం ఫిబ్రవరి 10న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 3.6 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఆధ్యాత్మిక గురువు సద్గురు, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, ప్రముఖ క్రీడాకారులు మేరీ కోమ్, అవని లేఖారా బోర్డు పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు చిట్కాలు అందజేస్తారు.