అసెంబ్లీ ఎన్నికల సీజన్ను మించిన రాజకీయ యుద్ధం తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు గేట్లు ఎత్తేస్తున్నామంటూ ఆపరేషన్ ఆకర్ష్, ఇవిగాకుండా కరువు పరిస్థితులు.. ఇవన్నీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ మూడు అంశాలపై కొన్నిరోజులుగా సాగుతున్న ఎపిసోడ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చను మరో లెవల్కు తీసుకెళ్లాయి..