రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయిన ప్రయాణికుడు.. రెప్పపాటులో..!

రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కబోతూ పడిపోయిన ప్రయాణికుడిని రెప్పపాటులో రక్షించాడు రైల్వే పోలీస్. నిండు ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో జరిగింది. మహారాష్ట్ర లాతూర్‌కి చెందిన ఏక్‌నాథ్‌ కుమ్లే రైలు దిగి స్టేషన్‌లోకి వెళ్లాడు. కాసేపటికి రైలు ప్రారంభం కావడంతో ప్రయాణికుడు పరుగెత్తి కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. మెట్లపై కాలు జారడంతో.. రైలు కింద పట్టాలపై పడబోయాడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సరైన సమయంలో స్పందించి తనని వెనక్కి లాగాడు.