వారెవ్వా.. ఏం ప్లాన్ గురూ..!

శ్రావణ మాసం మొదలైంది. అయితే ఎండలు మాత్రం రోహిణి కార్తెని తలపిస్తున్నాయి. ఎండల వేడిమి తాళలేక చెరువుల్లో చేపలు , రొయ్యలు విలవిలలాడుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికి వచ్చిన చేపలు ఎక్కడ చేజారుతాయోనని జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యేకించి ఏరియేటర్స్‌ను ఏర్పాటు చేసి, చేపలను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.