ఘనంగా మాణిక్యాంబభీమేశ్వర స్వామి కళ్యాణం.. రథోత్సవం..

భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ వార్ల ఉత్సవ విగ్రహాలను పూలతో అలంకరించిన రథంపై ఉంచి పలు గ్రామాల్లో ఊరేగించారు. ద్రాక్షారామంతో పాటు, వెలం పాలెం, అన్నాయిపేట గ్రామాల మీదుగా.. వేగాయమ్మ పేట గ్రామంలోని ఆస్థాన మండపం వరకు రథోత్సవం సాగింది. స్వామివారి ఊరేగింపులో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారి రథాన్ని లాగేందుకు.. భక్తులు భారీగా వచ్చారు.