వైభవంగా ప్రారంభమైన ఏడువారాల వెంకన్న బ్రహ్మోత్సవాలు

పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ వెలిసారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిలుతున్న వెంకన్న బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా మొదలయ్యాయి. ఏడువారాల వెంకన్నకు జరిగే బ్రహ్మోత్సవాలను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.