హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు..

ముస్లిం అయితేనేం.. మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచాడు. వినాయక వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాడు. పేరు మహ్మద్ ఇషాక్. ఊరు అక్కయ్యపాలెంలోని చిన్నూరు. శుక్రవారం కావడంతో నమాజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే.. ఏకంగా ఓ టెంపో ను వెంటపెట్టుకొని వచ్చి.. వాటి నిండా వినాయక విగ్రహాలు నింపుకుని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ సెంటర్కు చేరుకున్నాడు. చవితి సందర్భంగా.. హిందూ సోదరులందరికీ వినాయక ప్రతిమలను పంపిణీ చేశాడు.