మూసీకి పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు..

హైదరాబాద్ జంట జలాశయాల అన్ని గేట్లు తెరుచుకున్నాయి. జంట జలాశాలకు ఎగువనుంచి వస్తున్న ఉధృతితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ నిండుకుండలా మారాయి. వరద ప్రవాహంతో రెండు డ్యాంల్లో ఫుల్‌ ట్యాంక్‌ లెవర్‌ నీరు చేరడంతో జలమండలి అధికారులు గేట్లు ఎత్తారు. ఎగువన వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో జంట జ‌లాశయాల రిజ‌ర్వాయ‌ర్ల‌కు వ‌ర‌ద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది.