దేశవ్యాప్తంగా మరింత పెరిగిన వరద కష్టాలు.. జన జీవనం అస్తవ్యస్తం..

దేశమంతా వరద కష్టాలు మరింత పెరిగాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వారణాసిలో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది . ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడంతో అపారనష్టం జరిగింది. జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజోరి జిల్లాల్లో వరదల కారణంగా అపారనష్టం జరిగింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారులు ధ్వంసమయ్యాయి.